కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న పీజీ విద్యార్థి 2024లో అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ విద్యార్థిని తల్లి రత్నా దేబనాథ్(Ratna Debnath).. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచారు. పాణిహట్టి నుంచి విజయం సాధించిన ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్టు పెట్టారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఓటమి గురించి ఆమె కామెంట్ చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం సువేంధు అధికారిని ఆమె కలిశారు. సచివాలయంలోని 14వ అంతస్తులో ఉన్న సీఎం ఆఫీసుకు ఆమె వెళ్లారు.
తన ఎక్స్ అకౌంట్లో కామెంట్ చేస్తూ.. నబన్నలో ఉన్న 14వ అంతస్తుకు వెళ్లాలని, అక్కడ సీఎం సువేందు అధికారితో భేటీ అయ్యానని, గౌరవప్రదమైన అధికారం చాలా శక్తివంతమైందని, అన్యాయం పట్ల పోరాటేందుకు కేవలం సహనం కావాలని, ఇవాళ మమతా బెనర్జీ, తాను దుఖ్కంలో ఉన్నామని, నేను నా కూతుర్ని కోల్పోయాను అని, ఇక నేను నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేశానని, ఇక మమతా బెనర్జీ 14వ ఫ్లోర్లో ఉన్న కుర్చీని కోల్పోయిందని దేబనాథ్ అన్నారు. మాజీ సీఎం, తృణమూల్ నేతలు రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోనున్నట్లు దేబనాథ్ తెలిపారు.