న్యూఢిల్లీ: బీహార్లోని సుల్తాన్గంజ్లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ ఇటీవల కూలింది. అయితే దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి వివరణ ఇస్తూ.. బలమైన గాలులు వీయడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బలమైన గాలులు వీస్తే బ్రిడ్జ్ ఎలా కూలుతుందో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని మంత్రి తెలిపారు.
బీహార్లో ఏప్రిల్ 29వ తేదీన ఓ బ్రిడ్జ్ కూలిందని, దానిపై సెక్రటరీని వివరణ కోరగా ఆయన ఈ సమాధానం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఇంటివి నమ్ముతారో అర్థం కావడంలేదని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గట్టిగా గాలి వీస్తే బ్రిడ్జ్ కూలుతుందా, దీంట్లో ఏదో తప్పు జరిగి ఉంటుందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. నాణ్యత లోపం లేకుండా తక్కువ ఖర్చుతో మన్నికైన నిర్మాణాలను చేపట్టాలని మంత్రి అన్నారు. 1710 కోట్ల ఖర్చుతో ఆ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సుల్తాన్గంజ్, అగౌనీ ఘాట్ల మధ్య 2014లో బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. బ్రిడ్జ్ పొడుగు 3116 మీటర్లు ఉంటుంది.