న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ జోస్యం చెప్పారు. బీజేపీపై రాష్ట్రంలో వ్యతిరేకత బాగా పెరిగిపోయిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచింది కాంగ్రెస్ పార్టీ అయినా.. కుట్ర రాజకీయాలతో కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ గద్దెనెక్కిందని విమర్శించారు.
మధ్యప్రదేశ్ ప్రజలు జరిగిన పరిణామాలు అన్ని గమనించారని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ విషయంపై తాను రాతపూర్వకంగా గ్యారంటీ ఇస్తానని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని రాహుల్ చెప్పారు.