లక్నో: లఖింపూర్ ఖేరీలో కేంద్రమంత్రి కాన్వాయ్లోని జీపు కిందపడి మరణించిన రైతుల కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఘటనలో మరణించిన ఒక జర్నలిస్ట్ కుటుంబానికి కూడా పరిహారం వర్తిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్ చన్నీ ( Charanjit Singh Channi ) లక్నోలో మీడియా ముందు ప్రకటించారు. బాధిత రైతు కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
లఖింపూర్ ఖేరీలో హత్యకు గురైన రైతుల కుటుంబాలకు తాము అండగా ఉంటాం. పంజాబ్ ప్రభుత్వం తరఫున నేను మృతులు ఒక్కొక్కరి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నా. రైతులతోపాటు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒక జర్నలిస్టు కుటుంబానికి కూడా రూ.50 లక్షల పరిహారం ఇస్తాం.