లక్నో: గుడిసెలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు మరణించారు. (Children Die) ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామం డేరా బంజారా ప్రాంతంలోని ఒక గుడిసెలో శనివారం రాత్రి ఒక కుటుంబం నిద్రించింది. రాత్రి వేళ ఆ గుడిసెకు మంటలు అంటుకున్నాయి. నిద్రపోతున్న ముగ్గురు పిల్లలను కాపాడేందుకు తండ్రి షకీల్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటల్లో కాలి ఇద్దరు పిల్లలు మరణించారు. తీవ్రంగా కాలిన గాయాలైన మరో చిన్నారి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మరణించిన ముగ్గురు పిల్లలను ఏడేళ్ల సామ్నా, నాలుగేళ్ల అనీస్, రెండేళ్ల రేష్మగా గుర్తించారు.
కాగా, ఈ అగ్నిప్రమాదంలో పిల్లల తండ్రి షకీల్కు కూడా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. అతడ్ని ఆగ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. భార్య మమ్జాది అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు.