న్యూఢిల్లీ: చంద్రుడు, అంగారకుడిపైనా కాలనీలు ఏర్పాటు చేయాల నుకుంటున్న మానవుడు రోదసిలో పిల్లల్ని కనటంపైనా పరిశోధనలు సాగిస్తున్నాడు. సైంటిస్టులు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం రోదసి వాతావరణం పిల్లల్ని కనడానికి అనుకూలమైంది కాదని తేలింది.
రేడియేషన్, ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉండటం, గురుత్వాకర్షణ లేకపోవటం వంటివి సమస్యలున్నాయని ‘ద జర్నల్ రిప్రొడక్టివ్ బయో మెడిసిన్ ఆన్లైన్’ కథనం పేర్కొన్నది. మానవ పునరుత్పత్తిపై రేడియేషన్ ప్రభావాలు పూర్తిగా అర్థం కాలేదని, మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు వెల్లడించారు.