ఖాజకొట్టం : కేరళ యూనివర్సిటీ(Kerala University)లోని కరియవొట్టం క్యాంపస్లో బోటనీ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్లో మానవ కళేబరాన్ని గుర్తించారు. పోలీసులు ఆ ట్యాంక్ను, పరిసర ప్రాంతాలను ప్రస్తుతం సీజ్ చేశారు. ఆ కళేబరం కనీసం ఏడాది క్రిందటి అయి ఉంటుందని భావిస్తున్నారు. దాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు.
వర్సిటీలోని వాటర్ ట్యాంక్ సుమారు 20 అడుగులు ఉంటుంది. ఓ ఐరెన్ నిచ్చెనకు ఆ కళేబరం కట్టి ఉన్నది. మ్యాన్హోల్ ద్వారా దాన్ని తీశారు. ఆ మృతదేహం చుట్టూ లూజ్గా ముడివేసిన రోప్ ఉన్నది. ఆ ట్యాంక్ నుంచి కండ్ల అద్దాలు, క్యాప్, టై గుర్తించారు. ఓ బ్యాగు, షర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం పంప్ ఆపరేటర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించిన నేపథ్యంలో అక్కడ కళేబరాన్ని గుర్తించారు. ఓ తుక్కు పట్టిన గొడుగును గుర్తించిన తర్వాత అతను టార్చ్తో ఆ ట్యాంక్ను క్షుణ్ణంగా పరిశీలించాడు. అక్కడక్కడ బొక్కలు పడి ఉన్నట్లు పసికట్టాడు.
వర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ప్రాంతం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తే ఇక్కడ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కజాకొట్టమ్లో స్టేషన్ పరిధిలో నమోదు అయిన మిస్సింగ్ కేసుల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.