యూపీకి చెందిన వ్యాపారి పీయూశ్ జైన్ ఇంట్లో లెక్క కట్టలేనన్ని నోట్ల కట్టలు బయటపడ్డ విషయం తెలిసిందే. గురువారం నుంచి ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తూనే వున్నారు. ఆ నోట్ల కట్టలను లెక్కించడానికి ఐటీ అధికారులు దాదాపు ఎనిమిది, తొమ్మిది మెషిన్ల సాయంతో నోట్ల కట్టలను లెక్కపెడుతూ వచ్చారు. శుక్రవారం సాయంత్రం వరకూ ఐటీ అధికారులు 150 కోట్ల రూపాయలకు పైగా లెక్కించారు. 150 కోట్లకు పైగా దొరికిన నోట్ల కట్టలను ఎలా సురక్షితంగా తరలించాలో కాసేపు అధికారులకు అర్థం కాలేదు. చివరికి ఓ కంటెయినర్నే తీసుకొచ్చారు. ఆ కంటెయినర్లో ఆ డబ్బునంతా ఉంచి, తరలించారు.
పీయూశ్ జైన్ కాన్పూర్లో పర్ఫ్యూమ్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనపై పన్ను ఎగవేత ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొన్న ఐటీ అధికారులు గురువారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో లెక్కలేనన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో ఐటీ అధికారులు విస్తు పోయారు. వాటిని లెక్కించడం వారి తరం కాలేదు. దీంతో 8 మెషిన్లను తీసుకొచ్చి, లెక్కించారు. వాటి విలువ 150 కోట్లకు పై మాటే. గురువారం ప్రారంభమైన ఈ తనిఖీలు శుక్రవారం సాయంత్రం వరకూ సాగాయి.