న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇలాంటి ఘటనలపై విచారించేందుకు నిపుణల కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనాల్లో లోపాలు ఉన్నా.. నిర్లక్ష్యం వహించినా తయారీదారులపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే లోపాలున్న ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాగా, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి నీతిఆయోగ్ గురువారం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. బ్యాటరీ స్వాపింగ్ పాలసీ, బడ్జెట్ ఈవీలను కొనుగోలు చేసే వారికి ప్రోత్సాహకాలు, బ్యాటరీని పరీక్షించేటప్పుడు కచ్చితమైన ప్రమాణాలు పాటించడం వంటి కీలకమైన ప్రతిపాదనలను జాబితాలో చేర్చింది.