తిరువనంతపురం: డయాబెటిస్ రోగుల్లో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు కేరళకు చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ క్లోమాన్ని తయారు చేశారు. ఇది సాధారణ క్లోమంలాగానే శరీరానికి అవసరమైనప్పుడు, గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ను సరఫరా చేస్తుంది. కృత్రిమ క్లోమ వ్యవస్థలో సెన్సర్ ఉంటుంది. దీన్ని శరీరానికి అతికించుకోవాలి. ఇది స్మార్ట్ ఫోన్కు కనెక్ట్ అయి ఉంటుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు అప్రమత్తం చేస్తుంది. పంపింగ్ పరికరం ఇన్సులిన్ కొంచెంకొంచెంగా శరీరానికి అందిస్తుంది.