న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాలికపై జరిగిన యాసిడ్ దాడిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘నేరస్థులకు అంత ధైర్యం ఎలా వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలోని ప్రతి ఆడబిడ్డ భద్రత తమకు ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘దీనిని అస్సలు సహించలేం. నేరస్థులకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఢిల్లీలోని ప్రతి ఆడబిడ్డ భద్రత మాకు ముఖ్యం’ అని హిందీలో ట్వీట్ చేశారు. బాలికపై యాసిడ్ దాడికి సంబంధించిన న్యూస్ వీడియో క్లిప్ను కూడా షేర్ చేశారు.
కాగా, బుధవారం ఉదయం నైరుతీ ఢిల్లీలోని ద్వారకా మెట్రో స్టేషన్ వద్ద సోదరితో కలిసి ఉన్న 12వ తరగతి చదువుతున్న బాలిక ముఖంపై బైక్పై వచ్చిన ఇద్దరు యాసిడ్ పోశారు. బాధిత బాలికను సఫ్దర్జంగ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె ముఖం, కళ్లకు 8 శాతం మేర యాసిడ్ వల్ల కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆ బాలిక ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు ఒకర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. కేసు నమోదు గురించి, ఆ బాలిక గతంలో చేసిన ఫిర్యాదులపై శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ఢిల్లీ పోలీస్ను ఆదేశించింది.
ये बिल्कुल बर्दाश्त नहीं किया जा सकता। अपराधियों की इतनी हिम्मत आख़िर हो कैसे गई? अपराधियों को सख़्त से सख़्त सज़ा मिलनी चाहिए। दिल्ली में हर बेटी की सुरक्षा हमारे लिए महत्त्वपूर्ण है। https://t.co/zPpQXMJ5OY
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2022