Rameshwaram cafe blast | బెంగళూరు : బెంగళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్లో నిన్న మధ్యాహ్నం 12:56 గంటలకు బాంబు బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అమ్మ ఫోన్ కాల్ చేయడంతో తాను ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డానని ఓ యువకుడు తెలిపాడు. లేదంటే తాను కూడా పేలుడు ధాటికి గాయపడే వాడినని చెప్పాడు. అమ్మ దేవత అని నిన్ననే నిరూపితమైందన్నాడు.
అతని మాటల్లోనే.. నా పేరు కుమార్ అలంకృత్.. బెంగళూరులో ఇంజినీర్గా పని చేస్తున్నాను. మా ఆఫీసు రామేశ్వరం కేఫ్కు సమీపంలోనే ఉంది. నిన్న మధ్యాహ్నం లంచ్ కోసమని కేఫ్లోకి వెళ్లాను. ఇడ్లీ, దోస ఆర్డర్ కూడా చేశాను. అంతలోనే అమ్మ ఫోన్ చేయడంతో కేఫ్ నుంచి బయటకు వచ్చాను. కేఫ్కు 15 మీటర్ల దూరంలో ఉండి.. అమ్మతో ఫోన్ మాట్లాడుతుంటే పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి కాసేపు చెవులు పని చేయలేదు. అందరూ పరుగులు పెడుతున్నారు. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలిందని భావించాను అని కుమార్ పేర్కొన్నాడు. కేఫ్లోకి వెళ్లి చూడగా ఓ మహిళ చేతికి తీవ్ర గాయమైంది. రక్తం కారుతుంది. ఆమె వయసు 80 ఏళ్లు ఉంటుంది. మరో మహిళ శరీరం కాలిపోయింది. కేఫ్ సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారని కుమార్ తెలిపాడు.