గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యూఎన్ మెహత ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. హీరాబెన్ ఇటీవల వందో సంవత్సరంలో అడుగుపెట్టారు. తన తల్లి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్కు వెళ్లే అవకాశం ఉన్నది. ప్రధాని ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుజరాత్కు వచ్చిన సమయంలో తన తల్లిని కలుసుకున్నారు.