Jayant Chaudhary: కాంగ్రెస్ కీలక నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) ని ఉద్దేశించి రాష్ట్రీయ లోక్దళ్ (RLD) పార్టీ అధ్యక్షుడు జయంత్ ఛౌదరి (Jayant Chaudhary) వ్యంగ్య వ్యాఖ్యాలు చేశారు. ఇటీవల భారత్ జోడో న్యాయ్ యాత్ర వారణాసికి చేరుకున్న సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన సెటైర్లు వేశారు.
ఇటీవల వారణాసిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేసింది. వారణాసిలో తన యాత్ర సందర్భంగా జనం తప్పతాగి రోడ్లపై తూలుతూ కనిపించారని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. వారణాసి ప్రజలను తాగుబోతులు అంటాడా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ‘రాహుల్గాంధీ యాత్రకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కానీ, ఆయన యాత్రగా ఇక్కడికి రావద్దు, ఇక్కడి ప్రజలను తాగుబోతులు అని కించపర్చవద్దని నేను ఆశిస్తున్నా’ అంటూ జయంత్ ఛౌదరి సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇటీవలే జయంత్ ఛౌదరి INDIA కూటమిని వీడి NDA కూటిమిలో చేరారు.