ముంబై : కేంద్ర పంచాయతీరాజ్శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పాక్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి. ముంబైకి శివారు కళ్యాణ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ పాటిల్ ‘చూద్దాం.. వేచి చూద్దాం. 2024 నాటికి పెద్ద విషయం ఏదైనా జరగవచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) భారతదేశంలో భాగమవుతుందని ఆశించడంలో ఎటువంటి హాని లేదు. ఇవన్నీ మోదీ మాత్రమే చేయగలడు. అందుకే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, తృణధాన్యాలు తదితర చిన్న విషయాల గురించి మనం ఆలోచించకూడదు. దేశం లేకపోతే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తాం ?.. దేశాన్ని రక్షించాలి. ముందుగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దేశాన్ని రక్షించే పనిని చేపట్టారు’ అని వ్యాఖ్యానించారు. అలాగే కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రధాని మోదీ, అమిత్షా పగలు, రాత్రి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు.