న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో సోమవారం చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, నరేంద్ర సింగ్ తోమర్ ఆధ్వర్యంలో అమరీందర్ సింగ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అమరీందర్ సింగ్కు మీడియా ప్రతినిధులు ఓ ప్రశ్న సంధించారు. మీరు బీజేపీలో చేరారు.. మరి మీ భార్య సంగతేంటి? అని సింగ్ను జర్నలిస్టులు ప్రశ్నించారు. రాజకీయాల్లో భర్తను భార్య అనుసరించాల్సిన అవసరం లేదని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. భర్త ఏది చేసినా.. అది భార్య చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ప్రణీత్ కౌర్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం అమరీందర్ సింగ్.. గతేడాది పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను ఇవాళ బీజేపీలో విలీనం చేశారు.