న్యూఢిల్లీ, మార్చి 24: గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రుద్ర ఉన్నట్టుండి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎక్కువ వేతనం చెల్లిస్తామని కంపెనీ చెప్పినా కూడా ససేమీరా అంటున్నాడు. కారణమేంటని అడగ్గా.. ఆఫీసుకొచ్చి వర్క్ చేయమంటున్నారని చెప్పుకొచ్చాడు. ఒక్క రుద్రనే కాదు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఇండ్ల నుంచి పనిచేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగుల అభిప్రాయం దాదాపుగా ఇలాగే ఉన్నదని ప్రముఖ రిక్రూట్మెంట్ కంపెనీ సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 620 కంపెనీల్లోని 2 వేల మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు.
సర్వేలో కీలక విషయాలు
ఆఫీసుకొచ్చి పనిచేయడానికి ప్రతి పదిలో ఆరుగురు విముఖంగా ఉన్నారు. దీనికి బదులుగా ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
‘ఎక్కువ వేతనం చెల్లిస్తాం. ఆఫీసుకొచ్చి పనిచేయండి’ అని కంపెనీలు ఆఫర్ ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తామని 60 శాతం మంది తేల్చిచెప్పారు.
ఇంటి నుంచి పనిచేస్తుండటంతో తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ను సరిగ్గా బ్యాలెన్స్ చేయగలుగుతున్నామని, ఆఫీసుకు వెళ్తే ఇది కుదరకపోవచ్చని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.