శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన హిజ్బుల్ ఉగ్రవాది సోదరుడు రాయీస్ మట్టూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు (Terrorist’s brother hoisted Tricolour). ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలో భాగంగా సోమవారం సోపోర్లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను రెపరెపలాడించాడు. ఈ సందర్భంగా ‘సారే జహా సే అచ్ఛా..’ అంటూ భారత్ను కీర్తించాడు. తన గుండెల్లోని ప్రేమతో జాతీయ జెండాను ఎగురవేశానని, ఎవరి ఒత్తిడి వల్ల ఇలా చేయలేదని మీడియాతో అన్నాడు.
కాగా, జమ్ముకశ్మీర్లో అభివృద్ధి ఉందని, హిజ్బుల్ ఉగ్రవాది జావిద్ మట్టూ సోదరుడైన రాయీస్ మట్టూ తెలిపాడు. తొలిసారి ఆగస్ట్ 14న తన షాపులో కూర్చొన్నట్లు చెప్పాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గతంలో రెండు, మూడు రోజులు షాపులను మూసివేయించేవారని గుర్తు చేశాడు. గత రాజకీయ పార్టీలు తమ జీవితాలతో ఆటలాడుకున్నాయని విమర్శించాడు.
మరోవైపు తన సోదరుడు జావిద్ మట్టూ 2009లో ఉగ్రవాదిగా మారాడని రాయీస్ మట్టూ తెలిపాడు. ఆ తర్వాత అతడి గురించి తమకేమీ తెలియలేదని చెప్పాడు. బతికి ఉన్నట్లతే తిరిగి రావాలని పిలుపునిచ్చాడు. జమ్ముకశ్మీర్లో పరిస్థితి మారిపోయిందని, పాకిస్థాన్ ఏమీ చేయలేదని అన్నాడు. ‘హమ్ హిందుస్థానీ హై, ఔర్ రహేంగే’ అని వ్యాఖ్యానించాడు.
#WATCH | Rayees Mattoo says, "I waved the Tiranga from my heart. There was no pressure from anyone…Saare jahaan se achha Hindustan hamara, hum bulbule hain iske ye gulistan hamara. There is development. For the first time I am sitting at my shop on 14th August, it used to be… https://t.co/rWOfMLbTOg pic.twitter.com/hF1yx0P4vI
— ANI (@ANI) August 14, 2023