షిరిడీ, జనవరి 4: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై ఎన్సీపీ శరద్పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జంతువులను వేటాడే రాముడు మాంసాహారి అని మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంఎల్ఏ జితేంద్ర అవద్ పేర్కొన్నారు.
షిరిడీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ చీఫ్ శరద్ పవార్ సమక్షంలో మాట్లాడుతూ భగవాన్ శ్రీరాముడు ‘బహుజన’ వర్గానికి చెందిన వారని అన్నారు. అయినా 14 ఏండ్లు అడవిలో జీవించిన వ్యక్తికి శాకాహార భోజనం ఎక్కడ లభిస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, అజిత్ పవార్ వర్గం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అతడిపై వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.