పాట్నా: స్కూల్ తరగతి గదిలోని బ్లాక్బోర్డ్పై ఒకేసారి హిందీ, ఉర్దూను టీచర్లు బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. బీహార్లోని కతిహార్లో ఈ ఘటన జరిగింది. 2017లో స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాలను అక్కడి ప్రభుత్వ స్కూల్లోకి మార్చారు. దీంతో ఉపాధ్యాయులు హిందీ, ఉర్దూ రెండింటినీ ఒకే తరగతి గదిలో ఒకే సమయంలో బోధిస్తున్నారు. ఆ స్కూల్లో ఉన్న ఒకే క్లాస్ రూమ్లోని బ్లాక్బోర్డ్పై సగంలో హిందీని ఒక టీచర్ బోధిస్తుండగా మరో సగంపై ఉర్దూను మరో ఉపాధ్యాయుడు ఏకకాలంలో బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల అల్లరిని కంట్రోల్ చేసేందుకు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు తిప్పలుపడుతున్నారు.
కాగా, తమ ప్రభుత్వ స్కూల్లో ఒకే తరగతి గది ఉన్నదని ఆదర్శ్ మిడిల్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ప్రియాంక తెలిపారు. ఆ క్లాస్లో కూడా ఒకటే బ్లాక్బోర్డ్ ఉందన్నారు. 2017లో స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ఈ స్కూలులోకి మార్చినట్లు చెప్పారు. దీంతో ఒకే క్లాస్లోని ఒకే బ్లాక్బోర్డ్పై సగ భాగంలో హిందీ, మరో సగ భాగంలో ఉర్దూను ఇద్దరు టీచర్లు ఏకకాలంలో బోధిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జిల్లా విద్యాశాఖాధికారి కామేశ్వర్ గుప్తా దీనిపై స్పందించారు. వివిధ తరగతుల పిల్లలకు ఒకే తరగతి గదిలో ఒకే బ్లాక్బోర్డ్పై బోధించడం మంచిది కాదన్నారు. ఆదర్శ్ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు ఆధారంగా ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు ఒక క్లాస్ రూమ్ కేటాయిస్తామని తెలిపారు.
#WATCH | Bihar: Hindi & Urdu being taught on same blackboard in one classroom of a school in Katihar
Urdu Primary School was shifted to our school by Education Dept in 2017. Teachers teach both Hindi &Urdu in one classroom: Kumari Priyanka, Asst teacher of Adarsh Middle School pic.twitter.com/ZdkPE0j7tW
— ANI (@ANI) May 16, 2022