దిస్పూర్: అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. 12న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. 126 స్థానాలు కలిగిన అస్సాం అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 సీట్లు దక్కించుకోగా, మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్లు 10 సీట్లు చొప్పున గెలుచుకున్నాయి.
102 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని హిమంత కోరారు. దీనికి గవర్నర్ అనుమతించారు. దీంతో 12న హిమంత ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారని సమాచారం.