షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో స్థిరమైన కాంగ్రెస్ సర్కారు ఏర్పాటవుతుందని, పార్టీ తరఫున ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ పార్టీని వీడబోరని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ఎమ్మెల్యే సుఖ్విందర్ సింగ్ సుఖు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది ఎమ్మెల్యేల బలం అవసరమని, అయితే తాము 40 మందిమి గెలిచామని, ఇతరులు ముగ్గురు కూడా తమకే మద్దతిస్తున్నారని, దాంతో తమ బలం 43కి చేరిందని ఆయన తెలిపారు.
కాబట్టి కాంగ్రెస్ను వీడేవాళ్లు ఎవరూ లేరని, అవసరమైతే బీజేపీ నుంచే ఆరేడు మంది కాంగ్రెస్లోకి వస్తారని సుఖు చెప్పారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, తమను ఎవరూ చీల్చలేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఆదివారం కల్లా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.