Trekking Ban | హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్లో ట్రెక్కింగ్, పర్వతారోహణ కార్యక్రమాలపై నిషేధం విధించారు. ప్రస్తుతం భారీగా పొగ మంచు కురుస్తుండటంతో సోమవారం ముగ్గురు పర్వతారోహకులు మృతి చెందారు. వారంతా 13 ఏండ్ల బాలలే.
మరణించిన వారిని రాజేంద్ర పాఠక్, అశోక్ భాలెరావు, దీపక్ రావు అని అధికారులు గుర్తించరు. ఈ నేపథ్యంలో కిన్నౌర్ జిల్లా పరిధిలో అన్ని పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్పై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కేంద్రానికి 15 వేల అడుగుల ఎత్తున ఈ దుర్ఘటన జరిగింది.