Kangana Ranaut : బాలీవుడ్ నటి, మండి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి కంగనా రనౌత్ గతంలో బీఫ్ తిన్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగుతోంది. తాను బీఫ్ తినలేదని, సనాతన సంప్రదాయాలు పాటిస్తానని బాలీవుడ్ క్వీన్ వివరణ ఇచ్చింది. ఇక హిమాచల్ ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ మరోసారి ఈ వివాదాన్ని లేవనెత్తారు.
కంగనా రనౌత్ బీప్ తింటారని ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి ఆరోపించారు. కంగనా బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారని, రాష్ట్రం విపత్తును ఎదుర్కొన్న సమయంలో ఆమె ఎలాంటి పాత్ర పోషించారనేది అందరికీ తెలుసని మంత్రి సింగ్ పేర్కొన్నారు. కంగనా పలు ఇంటర్వ్యూల్లో తాను గతంలో బీఫ్ తిన్నానని అంగీకరించారని గుర్తుచేశారు.
కాగా మండి నుంచి కంగనా రనౌత్పై మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ను పోటీలో నిలపవచ్చని భావిస్తున్నారు. ఇక సింగ్ మండి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాగా, ఆయన తల్లి ప్రతిభా సింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్ నిరాకరించారు.
Read More :
KTR | హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం.. వేటాడుతాం.. రేవంత్ను హెచ్చరించిన కేటీఆర్