శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ను పుష్పవర్ధన విభాగం అధికారులు తెరిచారు. ఏటా పుష్పాలు వికసించే సీజన్లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గార్డెన్ను తెరుస్తుంటారు. ఈ పూదోటలో ఐదు రంగుల్లో తులిప్ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్ పూలతోపాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్లు ఉన్నాయి. అయితే శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్లు ఉంది. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్ను తెరుస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది తులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. అంటే ఈ 20 రోజులపాటు రంగురంగుల తులిప్ పుష్పాలు, రకరకాల ఇతర పుష్పాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. తాజాగా తులిప్ గార్డెన్లోని పుష్పాల అందాలను కింది వీడియోలో మీరూ వీక్షించండి..
#WATCH | Highland Park Kud, Tulip garden thrown open for visitors by J&K’s Department of Floriculture. Tulip flowers in five different colours brighten up the garden. pic.twitter.com/vkIqqCI9Fh
— ANI (@ANI) March 5, 2023