చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని నూహ్ జిల్లాలో కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్టే విధించింది. నూహ్ జిల్లాలో ఇటీవల మత ఘర్షణలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు ముందుగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఘటనపై కేసు నమోదు చేసి పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
అందులో భాగంగా ఈ మధ్య ఒక రెస్టారెంట్ను కూడా అధికారులు కూల్చివేశారు. ఒక వర్గానికి చెందిన కొంత మంది రౌడీలు, గూండాలు ఆ రెస్టారెంట్ పైనుంచి మరో వర్గం ర్యాలీపై రాళ్లు విసరడం ద్వారానే నూహ్లో మత ఘర్షణలు మొదలయ్యాయని, అది అక్రమ నిర్మాణమని తేలడంతో దాన్ని కూడా కూల్చివేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నూహ్లో ఆక్రమణల కూల్చివేతపై స్టే విధించింది. దాంతో తక్షణమే కూల్చివేతలను నిలిపివేయాలని నూహ్ పట్టణ డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు వెంటనే కూల్చివేతలను నిలిపివేశారు.