ముంబై: రోగుల రద్దీ భారం ఎక్కువైందని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోలేరని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇటీవల నాందేడ్, ఛత్రపతి శంభాజీనగర్ ప్రభుత్వ దవాఖానల్లో భారీగా రోగులు మృతి చెందడంపై హైకోర్టు శుక్రవారం విచారణ చేసింది.
ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర సరఫ్ ప్రభుత్వ వాదనలు వినిపిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది మీద భారం ఎక్కువైందని తెలిపారు. దీనికి కోర్టు స్పందిస్తూ.. ‘భారం ఉందని చెప్పి మీరు బాధ్యత నుంచి తప్పించుకోలేరు’ అని స్పష్టంచేసింది. పోస్టుల ఖాళీలను ప్రస్తావించింది.