Heroin Seized | ముంబయి డీఆర్ఐ అధికారులు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి దాదాపు పది కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకోగా.. అంతర్జాతీయ మార్కెట్లో విలువ రూ.70కోట్ల విలువ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
అడిస్ అబాబా నుంచి ముంబయికి వచ్చిన ప్రయాణికుడు డ్రగ్స్ను భారత్కు తరలిస్తున్నట్లుగా అధికారులకు పక్కా సమాచారం అందించింది. ఈ క్రమంలో విమానాశ్రయంలో అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్రయాణికుడిని పట్టుకొని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రయాణుడి సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో సూట్కేసులో 9.97 కిలోల హెరాయిన్ పట్టుబడింది. అంతర్జాతీయ మార్కెట్ విలువ దాదాపు రూ.70 కోట్లు ఉంటుందని చెప్పారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ట్రాలీ బ్యాగ్ను ముంబయిలోని ఓ హోటల్లో ఉన్న వ్యక్తిగి అప్పగించాల్సి ఉందని తెలిపాడు. దాంతో అతనితో కలిసి డెలివరీ కోసం హోటల్కు వచ్చిన నైజీరియన్ను అధికారులు పట్టుకున్నారు. నైజీరియా జాతీయుడి నివాసం నుంచి కొద్ది మొత్తంలో కొకైన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.