ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నవశేవ పోర్ట్లో పెద్ద ఎత్తున హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 టన్నుల కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.1,725 కోట్లు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఈ వివరాలు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.