ఇండోర్: సీఎంగా తాను విఫలమయ్యానని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పకనే చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరో పదేండ్లలో హైదరాబాద్ కంటే ఇండోర్ను అభివృద్ధిలో మిన్నగా చేస్తామని తెలిపారు.
సీఎంగా నాలుగుసార్లు పనిచేసినప్పటికీ, ఇండోర్ను అభివృద్ధి చేయలేకపోయిన చౌహాన్.. ఇప్పుడు మరోసారి తమను గెలిపించాలని ప్రజలను కోరడం విడ్డూరంగా ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు.