కేదార్నాథ్ యాత్రికులను తరలిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఏడుగురు మరణించారు. వీరిలో పైలట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ను దర్శించుకోవడానికి భక్తులు వచ్చారు.
వీరిలో ఆరుగురు మంగళవారం హెలికాప్టర్లో కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్త్కాశీకి బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్కు ఎదురుగా ఏమీ కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ కొండను ఢీకొని కుప్పకూలింది. అందులోని ఆరుగురు యాత్రికులు, పైలట్ అక్కడికక్కడే మరణించారు.