గోపేశ్వర్, జూన్ 29: కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిపై గురువారం రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని చింకా సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్, హేమ్కుండ్కు వెళ్తున్న వందల వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. అనేకమంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో అధికార బృందాలు అక్కడికి చేరుకుని కొండచరియలను తొలగించి సహాయక చర్యలు చేపట్టాయి. పర్యాటకులకు నీరు, ఆహార పదార్థాలను అధికారులు అందించారు.