చెన్నై: తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. తుఫాన్ వల్ల తమిళనాడు కోస్తా ప్రాంతం అంతా వర్షాలు నమోదు అవుతున్నాయి. నవంబర్ 29వ తేదీ వరకు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనేక జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. తిరునల్వెల్లి, తూత్తుకుడి, కన్యాకుమారి, రామనాథపురం, కడలూర్, తిరువన్మలై, చెంగల్పట్టు, విల్లుపురం, కల్లకూర్చి జిల్లాల్లో భీకర వానలు కురవనున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. చెన్నై, తిరువల్లూరు, కంచీపురం, మలైదుతరై, నాగపట్టణం, తిరువూరు, తాంజావూర్, మధురై, టెంకాశీ, తేని, దిండిగల్ జిల్లాలోనూ మోస్తారు కన్నా ఎక్కువ స్థాయిలో వర్షాలు పడనున్నాయి. చెన్నైలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారి కోసం 91 షెల్టర్లను ఏర్పాటు చేశారు. గడిచిన 24 గంటల్లో చెన్నైలో 46మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. వరదబాధిత షెల్టర్లలో ఉన్నవారి కోసం ఆహారం అందిస్తున్నారు. పూండి రిజర్వాయర్ నుంచి నీటిని వదులుతున్నారు.