DRDO | న్యూఢిల్లీ: సముద్రంపై సైనిక గస్తీలో అత్యంత కీలకమైన మానవ రహిత వాహనం ‘హీవ్’ (అధిక సామర్థ్య స్వయం ప్రతిపత్తి జలాంతర్గ వాహనం) పరీక్షలు విజయవంతమయ్యాయని డీఆర్డీవో తాజాగా వెల్లడించింది. కొచ్చిలోని కొచిన్ షిప్యార్డ్ వద్ద నిర్వహించిన మొదటి ‘ఉపరితల రన్’లో ‘హీవ్’ అన్ని రకాల లక్ష్యాల్ని పూర్తి చేసిందని డీఆర్డీవో తెలిపింది.
వాహనం టెస్ట్ రన్కు సంబంధించి వీడియో ఫుటేజ్ను శనివారం ‘ఎక్స్’లో విడుదల చేసింది. ‘హీవ్’ను త్వరలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు. సముద్రంలో శత్రు దేశాల జలాంతర్గాముల సైనిక ఆపరేషన్ను అడ్డుకోవటంలో ఈ తరహా వాహనాలు చాలా కీలకమని భారత నేవీ అధికారులు చెబుతున్నారు. ఇది 15 రోజులపాటు సముద్రం ఉపరితలంపై గస్తీ నిర్వహించగలదు. అంతేగాక నీటి అడుగున శత్రు దేశాల ‘సబ్ మెరైన్ల’ను గుర్తించటం, ముప్పును ట్రాకింగ్ చేయటం వంటివి చేపడుతుంది.