మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు ఫొటోలు చెప్తాయి. ఇందుకు మీరు చూస్తున్న ఈ రెండు ఫొటోలే ప్రబల సాక్ష్యం. మొదటిది అతికొద్ది మంది వీఐపీలతో కేంద్ర హోం మంత్రి అమిత్షా విందారగిస్తున్న దృశ్యం. గత ఆదివారం మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా పాల్గొన్న కేంద్ర మంత్రికి సభా వేదిక వెనుక ఫైవ్స్టార్ హోటల్ని తలదన్నే రీతిలో ఏర్పాటు చేసిన వసతిలో షడ్రుచులతో విందుభోజనం పెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఈ ఒక్క పూట విందుకే రూ.13.50 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. కానీ ఇదే సభలో పాల్గొన్న వేలాది మందికి కనీసం మంచినీరివ్వలేకపోయింది. నీడనిచ్చే టెంట్ లేక వడదెబ్బకు 14 మంది మృత్యువాతపడ్డారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విందుకు పెట్టిన ఖర్చులో పదోవంతు జనం కోసం కేటాయించినా సరిపోయేది. కానీ ఇవేమీ పట్టనట్టు అభినవ నీరోలా అమిత్షా పసందైన కాస్ట్లీ పదార్థాలతో, ఆంతరంగికులతో కలిసి ఆవురావురంటూ విందారగించారు.