థానే: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్గాంధీపై 2014లో దాఖలైన పరువు నష్టం దావాపై ఏప్రిల్ 1న తదుపరి విచారణ జరుపనున్నట్లు భివాండి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. అదేవిధంగా ఈ కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు శాశ్వత మినాహాయింపు ఇవ్వాలంటూ రాహుల్గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై కూడా అదేరోజున విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.
రాహుల్గాంధీ 2014లో థానే జిల్లాలోని భివాండిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ.. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై స్థానిక ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కుంతే.. భివాండిలోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో రాహుల్గాంధీపై పరువు నష్టం దావా వేశారు.
ఆ దావాపై ఏప్రిల్ 1న తదుపరి విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది. మరోవైపు ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తనకు శాశ్వత మినహాయింపునివ్వాలంటూ రాహుల్గాంధీ తన లాయర్ నారాయణ్ అయ్యర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పైన కూడా ఏప్రిల్ 1ననే విచారణ జరపనున్నట్లు కోర్టు పేర్కొంది.