Child Marriages: అసోం అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపించారు. తాను బతికి ఉన్నంత వరకు అసోంలో బాల్య వివాహాలు జరగనివ్వనని ఆయన వ్యాఖ్యానించారు. 2026వ సంవత్సరంలోపు రాష్ట్రంలో బాల్య వివాహాలకు పూర్తిగా తెరదించుతానని ప్రతిపక్షాలకు సవాల్ చేశారు.
‘నా మాటలు జాగ్రత్తగా వినండి, నేను బతికి ఉన్నంత వరకు అసోంలో బాల్య వివాహాలు జరగనివ్వను. హిమాంత బిశ్వశర్మ గొంతులో ప్రాణం ఉండగా అసోంలో బాల్య వివాహాలను అనుమతించే ప్రసక్తే లేదు. నేను మీకు రాజకీయంగా సవాల్ విసురుతున్నా.. 2026వ సంవత్సరం లోపు రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా తెరదించుతా’ అని హిమాంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు.
అసోం అసెంబ్లీలో 15వ ఎడిషన్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. బాల్య వివాహాలపై నిషేధం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పౌరులపై కేసులు నమోదు చేస్తున్నదంటూ ప్రతిపక్షాలు విమర్శించడంతో హిమాంత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను జరగనిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. కాగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అసోం సర్కారు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నది.
#WATCH | Assam CM Himanta Biswa Sarma speaks in the Assembly; says, “…Hear me carefully, as long as I am alive I will not let child marriage take place in Assam. I will not let this happen as long as Himanta Biswa Sarma is alive…I would like to challenge you politically, I… pic.twitter.com/PJgurSDOxz
— ANI (@ANI) February 26, 2024