న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ చేయనున్న ప్రసంగంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దాని ప్రకా రం..‘హీల్ ఇన్ ఇండియా’, ‘హీల్ బై ఇండియా’ పేరుతో కొత్త పథకాలు ప్రకటించే అవకాశముంది.
భారత్ను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడం, మౌలిక సదుపాయా లు కల్పించడం, మెడికల్ టూరిజం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హీల్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రకటించొచ్చు. వైద్య రంగానికి భారత్ను దిక్సూచిలా మార్చడం, డాక్టర్లు, ఆరోగ్య నిపుణులను ఆన్లైన్ ద్వారా ఓ వేదికపైకి తీసుకురావడం.. ప్రపంచవ్యాప్తంగా అందరికీ వైద్య సేవలే లక్ష్యంగా హీల్ బై ఇండియా పథకం ఉండొచ్చు.