న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ఆరోగ్యశాఖ ఓ కొత్త సూచన చేసింది. కోవిడ్ నుంచి రికవరీ అయిన మూడు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని చెప్పింది. కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా తేలిన వారు.. ఆ ఇన్ఫెక్షన్ నుంచి రికవరీ అయిన మూడు నెలల తర్వాత బూస్టర్ లేదా ప్రికాషన్ డోసు తీసుకోవాలన్నది. కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాశ్ షీల్ ఈ విషయాన్ని తెలిపారు. అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సార్స్ సీవోవీ2 వైరస్ నుంచి అస్వస్థతకు లోనైన వారు వ్యాక్సినేషన్ ప్రక్రియను మూడు నెలల వాయిదా వేయాలని, కోవిడ్ నుంచి కోలుకున్న మూడు నెలలకు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన తన లేఖలో సూచించారు. శాస్త్రీయ పరిశోధనలు, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్మునైజేషన్ చేసిన ప్రతిపాదన ఆధారంగా కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసినట్లు వికాశ్ చెప్పారు.