న్యూఢిల్లీ: భారతదేశం అధ్యక్ష వ్యవస్థ దిశగా అడుగులేస్తున్నదని.. ప్రపంచవ్యాప్తంగా నిరంకుశ ప్రభుత్వాల ట్రెండ్ కనిపిస్తున్నదని న్యాయ కోవిదుడు ఫాలీ నారీమన్ అన్నారు. మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషీ రాసిన పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏక కాలంలో ఎన్నికల వల్ల వ్యయం తగ్గుతుందన్న వాదనలను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తోసిపుచ్చారు. పార్లమెంటరీ వ్యవస్థ, నోరు లేని పార్లమెంట్ అనే అధ్వాన వ్యవస్థలు ప్రస్తుతం మనకు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.