న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పెండ్లికి అడ్డు పడిందన్న కోపంతో ప్రియురాలిని చంపి ఫ్రీజర్లో దాచాడు ఓ ప్రేమికుడు. ఢిల్లీలోని నజఫ్ఘర్లో మృతురాలి శవాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. దాబా నిర్వహించే సాహిల్ గహ్లోత్, పాతికేళ్ల యువతి ప్రేమికులు. గహ్లోత్ వేరే మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతడి ప్రేమికురాలు తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన గహ్లోత్ ఆమెను చంపి తన దాబాలోని ఫ్రీజర్లో ఉంచాడు. రెండు-మూడు రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.