న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు పసిడి పంచ్లతో అదరగొట్టాడు. పోలండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత మహిళా బాక్సర్లు ఏడు స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నారు. గీతిక (48 కిలోలు), బేబిరోజిసనా చాను (51కి), పూనమ్ (57కి), వింకా (60కి), అరుంధతి (69కి), సనామచు చాను (75కి), అల్ఫియా (+81కి) పసిడి పతకాలతో మెరిశారు. ఈ మెగా ఈవెంట్లో భారత్కు ఇది అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.