బెంగళూరు, ఆగస్టు 14: ఉన్మాదిగా మారిన ఒ భర్త కోర్టు ఆవరణలోనే తన భార్య గొంతును కత్తితో కోశాడు. అంతకు పది నిమిషాల ముందే కోర్టులో నిర్వహించిన కౌన్సెలింగ్లో ఇద్దరమూ కలిసి బతుకుతామని నిర్ణయానికి కూడా వచ్చారు. కానీ అంతలోనే పారిపోయేందుకు ప్రయత్నించాడు.
చుట్టుపక్కల వాళ్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కర్ణాటకలోని హస్సన్ జిల్లాలోని హోలెనారసిపుర ఫ్యామిలీ కోర్టు వద్ద జరిగింది. శివకుమార్, చైత్రలకు ఏడేండ్ల కింద పెండ్లి జరిగింది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. బ య టకు రాగానే తన కత్తితో శివకుమార్.. చైత్ర గొంతు కోశాడు. ఆమె చనిపోయింది.