బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని కుమారస్వామి ఈ ఉదయం ట్వీట్ చేశారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్లో ఉండాలని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. కర్ణాటక సీఎం యెడియూరప్ప కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. యెడియూరప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఇది రెండోసారి.
కర్ణాటకలో నిన్న ఒక్కరోజే కొత్తగా 14,859 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9,917 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 24 గంటల్లో కరోనాతో 78 మంది మరణించగా, ఒక్క బెంగళూరులో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,315. మొత్తం కేసుల సంఖ్య 11.24 లక్షలకు చేరుకోగా, మరణాల సంఖ్య 13,190కి చేరింది.
I have tested positive for COVID-19. I request everyone who came in close contact with me over the last few days to isolate themselves and get tested.
— H D Kumaraswamy (@hd_kumaraswamy) April 17, 2021
ನನ್ನ ಕೋವಿಡ್-19 ಪರೀಕ್ಷೆಯ ವರದಿ ಪಾಸಿಟಿವ್ ಎಂದು ಬಂದಿದೆ. ಕಳೆದ ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ನನ್ನ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಬಂದವರು ಕೋವಿಡ್ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಿ.