బెంగళూరు : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రితో తనకు మధ్య గ్యాప్ వచ్చిందన్న ఊహాగాలను కర్ణాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్ నేత కుమారస్వామి ఖండించారు. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరే అన్నారు. రాయచూర్లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందని కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు లభిస్తోందన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తితో పథకాలు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటక అభివృద్ధిని వెనక్కు నెట్టాయని ఆరోపించారు.