మీకు రీనా ద్వివేదీ గుర్తుందా? రీనా ద్వివేదీ గురించి తెలుసుకోవాలంటే గిర్రున ఒకసారి 2019 సంవత్సరానికి వెళ్లాల్సి ఉంటుంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో యూపీలో పోలింగ్ ఆఫీసర్గా ఉన్న రీనా ద్వివేదీ అప్పట్లో ట్రెండింగ్లో ఉన్నారు. తన గురించే సోషల్ మీడియాలో చర్చ. దానికి కారణం.. యెల్లో సారీ కట్టుకొని ఈవీఎంలను పట్టుకొని తను పోలింగ్ స్టేషన్లోకి వెళ్లే సమయంలో తీసిన ఓ ఫోటో అప్పట్లో సంచలనాలనే సృష్టించింది. దెబ్బకు తను సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఒక పోలింగ్ ఆఫీసర్.. ఓవర్ నైట్ స్టార్ అవడం అదే మొదటిసారి. హీరోయిన్ను తలదన్నే అందంతో తను పోలింగ్ సెంటర్ వద్ద హల్చల్ చేయడంతో అప్పట్లో తను ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.
ఆ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్కు ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగారు. తను అప్పటి నుంచి తన సోషల్ మీడియా అకౌంట్లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ యాక్టివ్గానే ఉంటోంది. తాజాగా యూపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లక్నోలోని ఓ పోలింగ్ స్టేషన్లో రీనా కనిపించింది.
దీంతో వెంటనే తన ఫోటోను క్లిక్మనిపించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో మరోసారి రీనా ద్వివేదీ వార్తల్లో నిలిచింది. తన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీనా ద్వివేదీది ఉత్తర ప్రదేశ్లోని డియోరియా అనే సిటీ. ప్రస్తుతం తను పీడబ్ల్యూడీ ఆఫీసర్గా పనిచేస్తోంది.