న్యూఢిల్లీ: తాను ఎవరికీ రాజీనామాను సమర్పించలేదని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు(CM Sukhvinder Singh Sukhu) తెలిపారు. తన రాజీనామా గురించి బీజేపీ వదంతులు వ్యాపింప చేస్తున్నదని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో అక్కడ కాంగ్రెస్ సర్కార్పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో సుఖ్విందర్ సర్కార్ ప్రమాదంలో పడింది. సుఖ్విందర్ రాజీనామా చేశారని బీజేపీ నేత జైరాం ఠాకూర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం సుఖ్విందర్ స్పందించారు. ఎవరు కూడా తన రాజీనామా గురించి ప్రస్తావించలేదన్నారు. తాను ఎవరికీ రాజీనామా సమర్పించలేదన్నారు. తమ మెజార్టీని ప్రూవ్ చేస్తామన్నారు. బడ్జెట్ సెషన్లో తాము గెలవనున్నట్లు చెప్పారు.