చండీగఢ్: సుమారు 120 మందిపై లైంగికదాడికి పాల్పడి, వీడియోలు తీసి బెదిరించిన కేసులో జిలేబీ బాబాను హ ర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. 14 ఏండ్ల జైలుశిక్షతోపాటు రూ.35 వేల జరిమానా విధించింది. జిలేబీ బాబా అసలు పేరు అమర్వీర్. 18 ఏండ్ల వయసులో పంజాబ్ నుంచి ఫతేహాబాద్కు వలసవచ్చాడు. తనకు తాంత్రిక విద్యలు తెలుసునని ప్రజల్ని నమ్మించేవాడు. తన దగ్గరకు వచ్చిన మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడేవాడు. ఓ మహిళ ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.