చంఢీఘడ్: ఇవాళ వరల్డ్ కార్ ఫ్రీడే. పర్యావరణాన్ని, ఈ ప్లానెట్ను రక్షించేందుకు ఈ రోజును నిర్వహిస్తున్నారు. మీరు ప్రతి రోజు వెళ్లే ప్రదేశానికి ఇవాళ బైక్పై లేదా సైకిల్పై లేదా వాకింగ్ చేస్తూ వెళ్లాలన్నదే దీని ఉద్దేశం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారానైనా ఉద్యోగ ప్రదేశానికి వెళ్లవచ్చు. వరల్డ్ కార్ ఫ్రీడే సందర్భంగా ఇవాళ హర్యానా సీఎం మనోహర్ సింగ్ ఖట్టర్.. తన ఇంటి నుంచి సెక్రటేరియేట్ వరకు సైకిల్ తొక్కుతూ వెళ్లారు. ఆయన ఒక్కరే కాదు, ఆయన క్యాబినెట్ సభ్యులు, ఎమ్మెల్యేలు కూడా సీఎం ఇంటి నుంచి సెక్రటేరియేట్ వరకు సైకిల్పై వెళ్లారు. వాస్తవానికి రవాణా వ్యవస్థ వల్ల వాయు, గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ఆ కాలుష్యాలను తగ్గించాలంటే, సైక్లింగ్ లేదా వాకింగ్ బెటర్ అన్న సందేశాన్ని వినిపించారు.
ప్రాణ వాయువు దేవతా పెన్షన్ స్కీమ్..
75 ఏళ్లు దాటిన వృక్షాలను మెయింటేన్ చేస్తున్నవారికి పెన్షన్ స్కీమ్ కింద ప్రతి ఏడాది రూ.2500 ఇవ్వనున్నారు. ప్రాణవాయువు దేవతా పెన్షన్ స్కీమ్ను సీఎం ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రావ్యాప్తంగా అలాంటి చెట్లను గుర్తించనున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక ప్రజలే ఈ స్కీమ్లో ఉంటారని సీఎం తెలిపారు.