చండీగఢ్: లైంగిక దాడి, హత్య కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్ మరోసారి వర్చువల్గా సత్సంగ్ నిర్వహించాడు. హర్యానాకు చెందిన పలువురు బీజేపీ నేతలు దీనికి హాజరుకావడం వివాదస్పదమైంది. అత్యాచార, హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ రామ్ రహీమ్ 40 రోజుల పెరోల్పై విడుదలయ్యాడు. అనంతరం సత్సంగ్లు నిర్వహిస్తున్నాడు. అయితే హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు దీనికి హాజరవుతున్నారు. తాజాగా పానిపట్లో రహీమ్ నిర్వహించిన సత్సంగ్కు పానిపట్ మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు పలువురు బీజేపీ నేతలు వర్చువల్గా పాల్గొన్నారు. దీనిపై మీడియా ప్రశ్నించగా తమ వ్యక్తిగత అంశమని వారు చెబుతున్నారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తురాలిపై లైంగిక దాడి, హత్య కేసులో జీవితకాల జైలు శిక్ష పడిన రామ్ రహీమ్కు 40 రోజులు పెరోల్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆదంపూర్ ఉప ఎన్నికకు ముందు పెరోల్పై విడుదల చేయడం, ఆయన నిర్వహించే సత్సంగ్ కార్యక్రమాల్లో బీజేపీ నేతలు స్వయంగా పాల్గొనడంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డేరా చీఫ్ పెరోల్ రద్దు చేయాలంటూ పంజాబ్ హర్యానా హైకోర్టును కొందరు ఆశ్రయించారు. ఆయన వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆరోపించారు. అయితే ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
#DeraSachaSauda chief #GurmeetRamRahim holds one more virtual Satsang in Panipat; many #BJP leaders, Mayor & Dy Mayor attend the Satsang.@Gurpreet_Chhina reports | #BreakingNews pic.twitter.com/8BJQdfD0kS
— Mirror Now (@MirrorNow) November 14, 2022